భారతదేశంలోకి వ్యాపారం నిమిత్తం వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ.. ఇక్కడ సిల్క్, కాటన్, ఇండిగో, టీ, ఉప్పు వంట వస్తువుల వర్తకం కొనసాగించేది. 1640 లో మన దేశంలో దాదాపు 23 పరిశ్రమలను స్థాపించి వంద మందికి ఉపాధి కల్పించింది. ఈ కంపెనీలు అప్పటివరకు భారతదేశం పరిపాలనలో తలదూర్చలేదు. కానీ, 1757 లో ప్లాసీ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోకి పాలనా పగ్గాలు రావడం మొదలయ్యాయి. ప్లాసీ యుద్దం తర్వాత బెంగాల్ నవాబుతో ఒప్పందం కుదుర్చుకుని నాణేలను తయారుచేయడం ప్రారంభించింది. తొలి రూపాయి నాణెం (One Rupee Coin) 264 సంవత్సరాల క్రితం 1757 లో సరిగ్గా ఇదే రోజున జారీ చేశారు.
మన దేశంలో నాణేల తయారీ కోసం సూరత్, బొంబాయి, అహ్మదాబాద్లో మింట్ను ఈస్ట్ ఇండియా కంపెనీ నెలకొల్పింది. సూరత్లో మింట్ ప్రారంభం అవడం జరిగినప్పటికీ.. తొలి రూపాయి నాణెం మాత్రం కోల్కతాలోని మింట్లోనే తయారైంది. బెంగాల్, మద్రాస్, బొంబాయి ప్రెసిడెన్సీల్లో వేర్వేరు నాణేలు అందుబాటులో ఉండేవి. బరువు, రంగులో కూడా వైవిధ్యం ఉండేవి. దాంతో నాణేలు అన్నీ ఒకేవిధంగా ఉండాలంటూ 1835 లో ఉత్తర్వులు జారీ చేయడంతో ఒకే రకం నాణేలు అందుబాటులోకి వచ్చాయి. 1857 తిరుగుబాటు తర్వాత, భారతదేశం పాలన నేరుగా బ్రిటీష్ రాజుల చేతుల్లోకి వెళ్లడంతో నాణేలపై బ్రిటీష్ చక్రవర్తి విలియం IV చిత్రాన్ని ముద్రించడం ప్రారంభించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో వెండి కొరత కారణంగా పేపర్ నోట్లు జారీ అయ్యాయి. 1947 లో భారతదేశం స్వతంత్రం పొందిన తర్వాత 1950 వరకు అవే నాణేలు చెలామణిలో ఉన్నాయి.
2014 : ఐపీఓకు వచ్చిన తొలి ఐటీ కంపెనీగా రికార్డుల్లోకెక్కిన గూగుల్
1994 : రెండు వ్యక్తిగత నోబెల్ బహుమతులు గెల్చుఉన్న భౌతికశాస్త్రవేత్త లైనస్ పాలింగ్ మరణం
1988 : ఎనిమిదేండ్ల పాటు కొనసాగిన యుద్ధంలో ఇరాన్-ఇరాక్ మధ్య అమలులోకి వచ్చిన కాల్పుల విమరణ ఒప్పందం
1964 : ప్రపంచంలో తొలి జియోసింక్రోనస్ ఉపగ్రహం ‘సింకోం-3’ ప్రయోగం
1960 : రెండు కుక్కలను ‘స్పుత్నిక్-5’ అంతరిక్ష నౌక ద్వారా అంతరిక్షంలోకి పంపిన సోవియట్ యూనియన్
1919 : బ్రిటన్ నుంచి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్న ఆఫ్ఘనిస్తాన్
నకిలీ వ్యాక్సిన్ల గుర్తింపు.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
ఈ చిన్నారి జిమ్నాస్టిక్స్.. అద్భుతం!
ఈ రోబోలు మనిషిలాగే దుంకుతాయి..!
ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా..? అయితే, ఇది మీ కోసమే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..