హైదరాబాద్ : బక్రీద్ (ఈద్-ఉల్- ఆజ్హా ) పవిత్ర దినం సందర్భంగా ముస్లిం సహోదరులకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( KCR ) శుభాకాంక్షలు ( Bakrid Greetings ) తెలిపారు. త్యాగానికి,దానగుణానికి ప్రతీకగా, విశ్వవ్యాప్తంగా ఇస్లాం ఆరాధకులు జరుపుకునే పర్వదినం బక్రీద్ పండుగ అని అన్నారు. ధనవంతులు, పేదలు అనే తరతమ బేధాలు లేకుండా, ప్రజల నడుమ శాంతి, సహనం సౌభ్రాతృత్వాన్ని బక్రీద్ పండుగ పెంపొందిస్తుందన్నారు.
ఈ పవిత్ర దినాన ధార్మికత, దైవచింతన ప్రతి మానవుడి హృదయంలో విరజిమ్మాలని కేసీఆర్ ఆకాంక్షించారు.గంగా జమున సంస్కృతికి ఆలవాలమైన తెలంగాణలో బక్రీద్ పండుగ సందర్భంగా ప్రజలనడుమ సోదర భావం ఐక్యత మరింత పెంపొందాలని కోరుకున్నారు.ప్రజలంతా సుఖ శాంతులతో జీవించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా దీవించాలని కేసీఆర్ దైవాన్ని ప్రార్థించారు.