కొలంబో : ఇప్పటికే విదేశీ అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంక.. ఇప్పుడు డ్రాగన్ గుప్పిట్లోకి (Dragon Clutches) వెళ్లింది. చైనా నుంచి తీసుకున్న రూ.2,200 కోట్ల రుణం తిరిగి చెల్లించనందుకు శ్రీలంకకు చెందిన హంబన్తోట పోర్టును స్వాధీనం చేసుకున్నది. ఈ మేరకు ఒప్పందంపై శ్రీలంక సంతకం చేసింది. చైనా డెవలప్మెంట్ బ్యాంక్-శ్రీలంక ప్రభుత్వం మధ్య ఈ ఒప్పందం శ్రీలంక అభ్యర్థన మేరకు జరిగినట్లు తెలుస్తున్నది. చైనా రాయబార కార్యాలయం వెలువరించిన ప్రకటన ప్రకారం, ఈ ఒప్పందం శ్రీలంకకు కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు.. అలాగే, ఆర్థిక పునరుద్ధరణ, ఆర్థిక స్థిరత్వం, మెరుగైన జీవనోపాధికి సహాయపడుతుంది.
రెండు దేశాల మధ్య జరిగిన ఈ ఒప్పందంలో చైనా పాత రుణ మద్దతులో రూ.11,877 కోట్లు కూడా ఉన్నాయి. శ్రీలంక ఇప్పటికే రెండు విడతలుగా రూ.7,423 కోట్ల రుణ సాయాన్ని పొందింది. మొదటి విడతగా 2020 మార్చి లో, రెండో విడతగా 2021 ఏప్రిల్ నెలలో శ్రీలంక అందుకున్నది. పూర్తిగా పర్యాటకంపై ఆధారపడిన శ్రీలంక.. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గణనీయమైన నష్టాలను చవిచూసింది.
హంబన్తోట పోర్టు కోసం శ్రీలంక ప్రభుత్వం చైనా నుంచి తీసుకున్న 8 బిలియన్ డాలర్ల రుణాన్ని తిరిగి చెల్లించలేకపోయింది. దాంతో 2017 లో హంబన్తోట పోర్టును చైనా కంపెనీకి 99 సంవత్సరాల లీజుకు ఇవ్వాల్సి వచ్చింది. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే ఓడరేవుల్లో హంబన్తోట పోర్టు ఒకటి. గత అనేక సంవత్సరాలుగా చైనా అభివృద్ధి ప్రాజెక్ట్ కోసం శ్రీలంకకు వేల కోట్ల రుణాలు ఇచ్చింది. శ్రీలంక ప్రభుత్వం 2025 నాటికి రూ.33 వేల కోట్ల విదేశీ రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉన్నది.
నకిలీ వ్యాక్సిన్ల గుర్తింపు.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
ఈ చిన్నారి జిమ్నాస్టిక్స్.. అద్భుతం!
ఈ రోబోలు మనిషిలాగే దుంకుతాయి..!
ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా..? అయితే, ఇది మీ కోసమే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..