టెహరాన్ : ఇరాన్లో కరోనా సంక్షోభం (Corona In Iran) ముదిరింది. అమెరికా, బ్రిటన్ వ్యాక్సిన్లను ఇరాన్ విశ్వసించడం లేదు. వ్యాక్సిన్లు మార్కెట్లో దొరక్కపోవడంతో ప్రజలు బ్లాక్లో కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. ఒక్కో వ్యాక్సిన్ ధర రూ. 90 వేల వరకు పలుకుతున్నట్లు సమాచారం. బ్లాక్ మార్కెటింగ్ కారణంగా, ఆస్ట్రాజెనెకా డోస్ ధర కూడా రూ.11 వేలకు పెరిగింది. దవాఖానలు కరోనా రోగులతో నిండిపోయి ఉండటంతో బ్లాక్ మార్కెటర్లకు బంగారం పంట పండుతున్నది. వ్యాక్సిన్ల కోసం ఎంత వరకైనా వెళ్లేందుకు ప్రజలు సిద్ధపడుతున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మంగళవారం ఇరాన్లో అత్యధికంగా 50,228 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం అత్యధికంగా 655 మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. దేశంలో కరోనా వ్యాక్సిన్లకు భారీ కొరత ఉన్నది. ప్రజలు బ్లాక్ మార్కెట్లో వ్యాక్సిన్లను కొనుగోలు చేయాల్సి వస్తున్నది. అమెరికా, బ్రిటన్ తయారీ వ్యాక్సిన్లను తీసుకోవద్దని, ఇవి పూర్తిగా నమ్మదగినవి కావని జనవరిలో ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా ఖొమేనీ ప్రకటించడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని ప్రజలు అంటున్నారు.
ఆర్థిక ఇబ్బందులు, అవినీతి కారణంగా ఇరాన్లో టీకాలు వేసే సంఖ్య చాలా తక్కువగా ఉంటున్నది. ఇరాన్ ప్రభుత్వ లెక్కల ప్రకారం, జనాభా 8.5 కోట్లు కాగా, వీరిలో 35 లక్షల మందికి మాత్రమే పూర్తిస్థాయిలో టీకాలు వేశారు. టీకాలు దిగుమతి చేసుకోవడానికి అనుమతించక పోవడం వల్లనే మరణాల సంఖ్య పెరుగుతున్నట్లు అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారిక టీకా కోసం ఇరాన్ ప్రజలు గత కొంతకాలంగా ఎదురుచూస్తున్నారు.
జమ్ములో ఎన్కౌంటర్, అమరుడైన జేసీఓ
చైనా గుప్పిట్లోకి శ్రీలంక.. హంబన్తోట పోర్టు స్వాధీనం
తొలిసారి రూపాయి నాణెం ఎప్పుడు వచ్చిందో తెలుసా..?
ఈ చిన్నారి జిమ్నాస్టిక్స్.. అద్భుతం!
ఈ రోబోలు మనిషిలాగే దుంకుతాయి..!
ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా..? అయితే, ఇది మీ కోసమే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..