కరోనా బాధిత కుటుంబాలకు నిత్యం అన్నదానం
మూగ జీవాలకు మంత్రి అల్లోల కోడలు దివ్యారెడ్డి పండ్లు అందజేత
నిర్మల్ అర్బన్, మే 25 : కరోనా బాధిత కుటుంబాలకు అండగా క్లిమామ్ నిలుస్తున్నది. హైదరాబాద్లోని ప్రధాన దవాఖానల వద్ద కరో నా బాధిత కుటుంబాలకు చేయూతనందిస్తున్నది క్లిమామ్ గోశాల నిర్వాహకురాలు, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోడలు దివ్యా రెడ్డి. లాక్డౌన్ వల్ల హోటళ్లు, రెస్టారెంట్లు లేకపోవడంతో కరోనా బాధి త సహాయకుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకు ని వారికి క్లిమామ్ భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్న ది. కొన్ని రోజులుగా పలు హాస్పిటల్ వద్ద కరోనా బాధిత సహాయకులకు అన్నదానం చేస్తున్నారు. మంగళవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భోజనాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులతో కలిసి ఫుడ్ ప్యాకింగ్ చేశారు. ఈ సందర్భంగా క్లిమామ్ గోశాల ఫౌండర్ అల్లోల దివ్యారెడ్డి మాట్లాడుతూ భారతీయ సాంప్రదాయంలోనే తరతరాలుగా వసుదైక కుటుంబం అనే భావన ఉందని పేర్కొ న్నారు. దీంతో కరోనా లాంటి విపత్కర పరిస్థితు ల్లో బాధితులకు తోడుగా నిలువడం కర్తవ్యంగా భావించి సేవ చేస్తున్నామని తెలిపారు. కరోనా సోకి దవాఖానలో చేరి చికిత్స పొందుతున్న వారి కుటుంబసభ్యులకు నిత్యం ఉచితంగా అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. అన్నదానం మరికొన్ని రోజుల పాటు చేపడుతామన్నారు.
మూగ జీవాలకు పండ్లు అందజేత..
అల్లోల దివ్యారెడ్డి పేదలకు అన్నదానం చేయ డంతోపాటు నగర శివారులో మూగ జీవాల ఆకలిని తీర్చారు. ఆహారం అందక ఆకలితో అల మటిస్తున్న మూగ జీవాలకు దివ్యారెడ్డి మంగళవా రం పండ్లను అందించారు. మూగ జీవాల పట్ల జాలితో వ్యవహరించాలని కోరారు. టీఆర్ఎస్ యువజన నాయకుడు అల్లోల గౌతంరెడ్డి, క్లిమా మ్ టీం సభ్యులు పాల్గొన్నారు.