న్యూఢిల్లీ : భారత్ లో రెనాల్ట్ కార్ల ధరలు మరోసారి భారమయ్యాయి. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ లో రెండు సార్లు వాహనాల ధరలు పెంచిన ఫ్రెంచ్ ఆటో దిగ్గజం తాజాగా మళ్లీ కార్ల ధరలను పెంచింది. ముడిపదార్ధాల ధరలు పెరగడంతోనే వాహనాల ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ వెల్లడించే అవకాశం ఉంది.
రెనాల్ట్ డస్టర్, రెనాల్ట్ కైగర్, క్విడ్, ట్రైబర్ సహా కంపెనీ మోడల్స్ అన్నింటిపై ధరలు రూ 7095 నుంచి రూ 39,030 వరకూ ఎగబాకాయి. స్టీల్, అల్యూమినియం, ప్లాస్టిక్స్ సహా ఇతర ముడిపదార్ధాల ధరలు పెరగడంతోనే వాహనాల ధరలు పెంచినట్టు ఈ ఏడాది జనవరిలో కార్ల ధరలు పెంచిన క్రమంలో రెనాల్ట్ ఇండియా పేర్కొంది.