ముంబై : (Reliance) గ్రీన్ ఎనర్జీ వ్యాపారంలో భాగంగా చైనా నేషనల్ బ్లూస్టార్కు చెందిన కంపెనీతో రిలయన్స్ ఇండస్ట్రీస్ జతకట్టింది. దీని ద్వారా మన దేశంలో హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ తయారై..
దేశంలో జీరో కార్బన్ ఇంధనాన్ని తయారు చేసే దిశగా పెద్ద అడుగు పడనున్నది. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ.6 వేల కోట్లు (771 మిలియన్ డాలర్లు) ఉంటుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) యాజమాన్యంలోని రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ (ఆర్ఎన్ఈఎస్ఎల్) సంస్థ, చైనా నేషనల్ బ్లూస్టార్ (గ్రూప్) కంపెనీ లిమిటెడ్తో ఒప్పందం చేసుకున్నది. ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్ 100 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్లు రిలయన్స్ బీఎస్ఈ ఫైలింగ్లో పేర్కొన్నది. 2030 నాటికి కనీసం 100 గిగావాట్ల సౌర సామర్థ్యాన్ని నిర్మించే ప్రణాళికలను కలిగి ఉన్న గ్లోబల్-స్కేల్ ఫోటోవోల్టాయిక్ (పీవీ) తయారీ సంస్థగా మారడానికి రిలయన్స్ దృష్టి కేంద్రీకరించింది. వీటి ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేయనున్నది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) కార్బన్ ఉద్గారాలను తగ్గించే ఇంధనాన్ని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా చైనా నేషనల్ బ్లూస్టార్కు చెందిన ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్ను కొనుగోలు చేసింది.
ఆర్ఈసీ ఒక బహుళజాతి సౌర శక్తి ఉత్పత్తి సంస్థ. ఇది 1996 లో నార్వే ప్రధాన కార్యాలయంగా ప్రారంభమైంది. దీని ఆపరేషనల్ హెడ్క్వార్టర్స్ సింగపూర్లో ఉన్నది. ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, ఆసియా పసిఫిక్లో కూడా ఈ సంస్థ ప్రాంతీయ కేంద్రాలను కలిగి ఉన్నది.
స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ ఎగుమతికి కేంద్రం గ్రీన్సిగ్నల్
మళ్లీ ప్రమాదకరంగా మారిన ఢిల్లీ గాలి నాణ్యత
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన టయోటా మిరై
జమ్ముకశ్మీర్లో 16 చోట్ల ఎన్ఐఏ దాడులు
2036 లో ఇండియాలో ఒలింపిక్స్..!
ఆసియాలో తొలిసారి ఒలింపిక్స్ నిర్వహణ ఇక్కడే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..