Banks Tokenisation |బ్యాంకులు.. ఫిన్టెక్ కంపెనీలకు.. వివిధ బ్యాంకుల ఖాతాదారులకు భారీ రిలీఫ్ లభించింది. సురక్షిత ఆన్లైన్ పేమెంట్స్ కోసం ప్రతిపాదించిన టోకెనైజేషన్ వ్యవస్థ అమలు గడువును ఆర్బీఐ ఆరు నెలలు పొడిగించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 2022 జనవరి ఒకటో తేదీ నుంచి టోకెనైజేషన్ అమలు కావాల్సింది. వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ గడువు పొడిగించినట్లు ఆర్బీఐ తెలిపింది.
వివిధ బ్యాంకులు, ఫిన్టెక్, ఆర్థిక సంస్థల వద్ద ఖాతాదారులకు చెందిన డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల వ్యక్తిగత డేటా స్టోరేజీ (కార్డ్ ఆన్ పైల్- (సీవోఎఫ్))ని ఆయా సంస్థలు నిల్వ చేసుకునేందుకు అనుమతిస్తున్నామని వివరించింది. ఈ గడువులోగా బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో వాటాదారులు, సంస్థలు.. (నెలవారీ వాయిదా చెల్లింపులు.. రికరింగ్ ఈ-మాండేట్) ఏ అంశం/ సమస్యైనా పరిష్కరించడానికి ఆల్టర్నేటివ్ వ్యవస్థను రూపొందించుకోవాలని సూచించింది.
వచ్చే నెల ఒకటో తేదీ నాటికి కార్డుల స్టోర్ చేసుకోలేని ఆన్లైన్ మర్చంట్ సంస్థలు.. పాత కార్డుల స్థానే రాండమైజేషన్ టోకెన్ నంబర్తో కొత్త కార్డులు జారీ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఆన్లైన్ పేమెంట్స్ సేఫ్టీ కోసం గతేడాది మార్చి 17న ఆర్బీఐ ఈ గైడ్లైన్స్ జారీ చేసింది. తిరిగి గత సెప్టెంబర్ వరకు.. మూడో దఫా డిసెంబర్ నెలాఖరు వరకు గడువు పొడిగించింది.
దేశవ్యాప్తంగా 98.5 కోట్ల డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు ఉన్నాయని ఇండస్ట్రీ బాడీ.. కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) అంచనా వేసింది. ప్రతి రోజూ 1.5 కోట్ల లావాదేవీల్లో రూ.4000 కోట్లు చేతులు మారతాయని పేర్కొంది. 2020-21లో భారత డిజిటల్ పేమెంట్స్ 14,14,85,173 కోట్లు ఉంటుందని అంచనా వేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Safe Online Transactions | ఈ టిప్స్ పాటిస్తే మీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ సేఫ్.. లేదంటే గోవిందా..?
Shining Mask: కొవిడ్ వైరస్ చేరిందో.. ఈ మాస్క్ మెరుస్తుంది! కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు
Signal | వాట్సప్కు దీటుగా దూసుకెళ్తున్న సిగ్నల్.. మరో అద్భుతమైన ఫీచర్
Fake PAN Card | నకిలీ పాన్కార్డును గుర్తించడం ఎలా? స్మార్ట్ఫోన్ ఉంటే చాలు.. ఇదిగో స్టెప్స్
గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా? వెంటనే అప్డేట్ చేసుకోండి.. ఆదేశించిన కేంద్రం