Goods Price | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): నిత్యావసరాల ధరల పెంపుతో ఇప్పటికే బెంబేలెత్తిపోతున్న సామాన్యులకు కొత్త ఆర్థి సంవత్సరం ఆర్థిక కష్టాలను తీసుకురాబోతున్నది. ఇటీవల కేంద్ర ఆర్థికశాఖ బడ్జెట్లో చేసిన ప్రకటనల ఆధారంగా ఏప్రిల్ 1 నుంచి కొన్ని వస్తువుల ధరలు పెరుగనున్నాయి. దిగుమతి చేసుకొనే ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్ వస్తువులు ఈ జాబితాలో ఉన్నాయి.
దిగుమతి చేసుకొనే ఎలక్ట్రానిక్ వస్తువులు: స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలు సహా వైఫై ఆధారిత ఫ్రిజ్లు, వాషింగ్మెషీన్లు, ఏసీలు ఈ జాబితాలోకి వస్తాయి. 60 శాతం ఎలక్ట్రానిక్స్ వస్తువులను కేంద్రం విదేశాల నుంచే దిగుమతి చేసుకొంటున్నది. తాజా నిర్ణయం వల్ల వచ్చే నెల నుంచి మొబైల్స్, టీవీలు, ఫ్రిజ్ల ధరలు పెరుగనున్నాయి.
ప్లాస్టిక్ వస్తువులు: దైనందిన జీవితంలో 90 శాతం కార్యకలాపాలు ప్లాస్టిక్తోనే ముడిపడి ఉన్నాయి. వాటర్ బాటిల్స్, కూల్డ్రింక్ బాటిల్స్, ఆడుకొనే బొమ్మలు, అవుట్డోర్ ఫర్నిచర్, కంటైనర్లు, కార్ల భాగాలు, లగేజీ, మెడిసిన్ కవర్లు ఇలా ప్లాస్టిక్తో చేసిన అన్నింటి ధరలు పెరుగనున్నాయి.
ఇమిటేషన్ ఆభరణాలు: బంగారం కొనలేని పేద, మధ్యతరగతి వారికి గిల్టు నగలే (ఇమిటేషన్ ఆభరణాలు) నిజమైన ఆభరణాలు. ఇప్పుడు ఇవి కూడా పెరుగబోతున్నాయి. ఇప్పటికే రూ. 60 వేల మార్కును దాటిన తులం బంగారం ధర మరింత పెరుగనున్నది. వెండి, ప్లాటినం ధరలు కూడా పెరుగనున్నాయి.
ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీలు: ఇండ్లలో విరివిగా ఉపయోగించే ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీలతో పాటు ప్రైవేట్ జెట్లు, హెలికాప్టర్లు, సిగరెట్ల రేట్లు కూడా వచ్చే 1వ తేదీ నుంచి పెరుగుతాయి.
UPI Payments | యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా? ఏప్రిల్ 1 నుంచి ఇక ఆలోచించాల్సిందే !
ఏప్రిల్ 1 లోపే పాలసీ తీసుకోండి లేకపోతే పన్ను బాదుడు