న్యూఢిల్లీ, మార్చి 28: అధిక ప్రీమియం గల బీమా పాలసీలు తీసుకోవాలనుకునేవారు ఆ పని ఏప్రిల్ 1 లోపే చేయడం బెటర్. ఎందుకంటే తాజా బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం వీటిపై పన్ను భారం పడనుంది. ఒక సంవత్సరంలో రూ. 5 లక్షలకు మించి ప్రీమియం చెల్లించే జీవిత బీమా పాలసీలపై వచ్చే మెచ్యూరిటీ మొత్తంపై పన్నును ప్రతిపాదించారు.
ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పాలసీలైనా వాటి ప్రీమియం చెల్లింపులు రూ.5 లక్షలు దాటితే పన్ను భారం పడుతుంది. ప్రస్తుత పాలసీలకు, ఏప్రిల్ 1లోపు కొనుగోలు చేసిన పాలసీలపై ఇది వర్తించదని బడ్జెట్లో స్పష్టంచేశారు. మార్చి 31 తర్వాత తీసుకునే పాలసీల మెచ్యురిటీ మొత్తంపై పన్నుపై వివరణ వెల్లడికావాల్సి ఉంది.