Union Minister Puri On Petrol Rates | కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీకి నోరుజారడం అలవాటుగా మారింది. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం సబబేనని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీ సమర్థించుకున్నారు. కరోనా మహమ్మారి వేళ లక్షల మంది పేదలకు ఉచితంగా భోజనం, వంట గ్యాస్ సరఫరా చేయడంతోపాటు ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయడానికి పెట్రోలియం ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలు చేయూతనిస్తున్నాయని పేర్కొన్నారు.
పలు సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు డబ్బు చెల్లించడానికి పన్నులు విధించడం న్యాయబద్ధమేనన్నారు. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా చమురు ఉత్పత్తుల ధరలు పెరగడానికి వివిధ రకాల కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని వాదిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు తమ పన్నులు ఎందుకు తగ్గించుకోవడం లేదని ప్రశ్నించారు. పన్నుల రూపేణా వసూలైన నిధులతో రోడ్ల అభివృద్ధికి, అణగారిన వర్గాలకు ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదలకు కారణాలు చెప్పడానికి తానేమీ ఆర్థిక మంత్రిని కాదన్నారు.
ఎనిమిది కోట్ల పేద కుటుంబాలకు ఉచితంగా ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు పూరీ తెలిపారు. లీటర్ పెట్రోల్పై రూ.32 వసూలు చేస్తున్న ఎక్సైజ్ డ్యూటీతో 100 కోట్ల వ్యాక్సిన్లతోపాటు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. ఇంతకుముందు పశ్చిమబెంగాల్లో భవానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగానూ పెట్రోల్ ఉత్పత్తుల ధరల పెరుగుదలను హర్దీప్సింగ్ పూరీ సమర్థించుకున్నారు. తృణమూల్ వల్లే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని సెలవిచ్చారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Provident Fund | ఉద్యోగం మారితే.. పాత పీఎఫ్ విత్డ్రా నాట్గుడ్.. ఎందుకంటే?!
మొబైల్ రీచార్జ్లపై ఫోన్పే బాదుడు
Huzurabad | ఈటల మధ్యలో వచ్చిండు..మధ్యలోనే పోయిండు: కెప్టెన్ లక్ష్మీకాంతారావు..