న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ఫోన్పే.. తమ వినియోగదారులకు షాకిచ్చింది. మొబైల్ రీచార్జ్లపై ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేయడం మొదలు పెట్టింది. యూపీఐ ద్వారా రూ.50 అంతకుమించి విలువైన మొబైల్ రీచార్జ్లు చేసుకున్నవారి నుంచి ఒక్కో లావాదేవీకి రూపాయి నుంచి 2 రూపాయల మేర చార్జ్ చేస్తున్నది. దీంతో ఈ తరహా యూపీఐ ఆధారిత లావాదేవీలకు చార్జీలను వసూలు చేస్తున్న తొలి డిజిటల్ పేమెంట్స్ యాప్గా ఫోన్పే నిలిచింది. ప్రస్తుతం ఫోన్పే మినహా ఇతర ఏ డిజిటల్ పేమెంట్స్ సంస్థలూ.. యూపీఐ లావాదేవీలకు చార్జీలు వసూలు చేయడం లేదు. ఇప్పటికే ఇతర పోటీ సంస్థల మాదిరిగానే క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే చెల్లింపులకు ఫోన్పే ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేస్తున్నది. ఇప్పుడు వీటికితోడు మొబైల్ రీచార్జ్లపైనా ప్రాసెసింగ్ ఫీజులను బాదుతున్నది. ‘రూ.50 కంటే తక్కువ మొబైల్ రీచార్జ్లపై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజులుండవు. రూ.50-100 రీచార్జ్లపై రూపాయి, రూ.100కు మించిన రీచార్జ్లపై రూ.2 చార్జీలు పడుతాయి’ అని ఫోన్పే ప్రతినిధి తెలిపారు.