వీణవంక: చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, సంపాదించిన ఆస్తులను కాపాడువోవడానికి కేవలం తన స్వార్థం కోసమే ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు అన్నారు.మండలంలోని కనపర్తి గ్రామంలో శనివారం జరిగిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో జడ్పీవైస్చైర్మన్ పేరాల గోపాల్రావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని, గెల్లు శ్రీనివాస్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ఆరంభం నుంచి పని చేస్తూ లాఠీ దెబ్బలు, తుపాకీ దెబ్బలు తిన్న, జైళుకు పోయిన పేదింటి బిడ్డ, ఉస్మానియా ఉద్యమనేత గెల్లు శ్రీనివాస్ను ప్రజలు గెలిపించాలని అన్నారు.
ఈటల రాజేందర్ రాకముందే కమలాపూర్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ బలంగా ఉందని, ఆయన మధ్యలో వచ్చి మధ్యలోనేపోయాడని తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని, అభివృద్ధి చేస్తున్న పార్టీకి ప్రజలు అండగా ఉండాలని, గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాడ వనమాల-సాదవరెడ్డి, వైస్ఎంపీపీ రాయిశెట్టి లత-శ్రీనివాస్, సర్పంచ్ పర్లపెల్లి రమేష్, మాజీ సర్పంచ్లు శ్యాంసుందర్రెడ్డి, పులి ప్రకాశ్, వార్డు సభ్యులు ,నాయకులు తిరుపతి, ప్రకాశ్, కోమాల్రెడ్డి, బొల్లు సదానందం, నర్సయ్య, దిలీప్, బొందయ్య, వెంకటస్వామి, పూర్ణచందర్, ముత్తిరెడ్డి సమ్మిరెడ్డి, మహెందర్రెడ్డి, సర్వేశ్, కొయ్యడి మొగిలి, వెంకటేశ్, భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.