ఈ ఏడాది లక్ష మందిని నియమించుకోనున్న సంస్థలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: దేశీయ ఐటీ సంస్థలు ఉద్యోగ నియమాకాల్లో జోరు పెంచాయి. కరోనా సంక్షోభంతో ఓవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నప్పటికీ.. మరోవైపు సాఫ్ట్వేర్ రంగం భారీ ఒప్పందాలకు వేదికైంది. దీంతో దేశీయ సంస్థలు విస్తృత స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమయ్యాయి. మహమ్మారి కారణంగా గతేడాది అంతంత మాత్రంగానే నియమాకాలు చేపట్టిన సంస్థలు.. ఈసారి జెట్ స్పీడ్ వేగంతో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ రంగంలో డిజిటలైజేషన్ కారణంగా ఐటీ సేవలకు ఎనలేని డిమాండ్ నెలకొన్నది. దీంట్లో భాగంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి దేశీయ ఐటీ కంపెనీలు వేలాది మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు ప్రకటించాయి. గతేడాది నియమించుకున్న వారితో పోలిస్తే 45 శాతం వరకు అధికంగా అంటే మొత్తంగా లక్ష మందికి ఉపాధి కల్పించబోతున్నాయి.
టీసీఎస్ దూకుడు
ఉద్యోగ నియామకాల్లో టీసీఎస్ దూకుడును ప్రదర్శిస్తున్నది. ప్రస్తుత ఆర్థి క సంవత్సరంలో 40 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ఇటీవల ప్రకటించింది. మరోవైపు ఇన్ఫోసిస్ 26 వేల మందిని, హెచ్సీఎల్ టెక్నాలజీ కూడా 12 వేల మందిని తీసుకోబోతున్నాయి.
నైపుణ్యానికి పెద్దపీట
నైపుణ్యానికి ఐటీ సంస్థలు పెద్దపీట వేస్తున్నాయి. డాటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్లో నైపుణ్యం కలిగిన వారిని తీసుకోవడానికి సంస్థలు విశ్వ విద్యాలయాల ముందు క్యూ కడుతున్నాయి.
ఇవీ కూడా చదవండీ…