హైదరాబాద్, ఏప్రిల్ 16: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘ఏరోసిటీ’ని ప్రారంభిస్తున్నట్లు జీఎమ్మార్ ప్రకటించింది. 1,500 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న ఈ ఏరోసిటీలో బిజినెస్ పార్క్, రిటైల్, ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్, లాజిస్టిక్ పార్క్, ఆతిథ్యం వంటి వాటిని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపింది. సుమారు పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దశలవారీగా అభివృద్ధి చేయనున్న 4 టవర్లలో మొదటి టవర్ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు వెల్లడించింది.
‘వ్యాపార విధానంలో సమూల మార్పులు తేవాలన్న ఉద్దేశంతో ఈ ఏరోసిటీని ఏర్పాటు చేస్తున్నాం. వర్క్స్పేస్ డిజైన్ సామర్థ్యాన్ని పెంచడం, స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ వర్క్స్పేస్లను అందించడం ద్వారా అంతర్జాతీయ సంస్థలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, భద్రత కల్పిస్తాం.’
ఇవీ కూడా చదవండీ…