Maruti Car Expensive | దేశంలోని అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకిలో చౌక ధరకు లభించే ఎంట్రీ లెవెల్ ఆల్టో మోడల్ కారు ధర కూడా రూ.18 వేలు పెరిగింది. మిగతా కార్ల ధరలు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకూ పెరిగాయి. స్విఫ్ట్, డిజైర్, ఎకో, ఎర్టిగా, ఎస్-ప్రెస్సో మోడల్ కార్ల ధరలు మరింత పెరిగి రూ.25 వేల మేరకు కొనుగోలుదారుడిపై భారం పెరిగింది.
కమొడిటీస్ ఖర్చులు పెరిగాయంటూ మారుతి సుజుకి ఈ ఏడాది కార్ల ధరలు పెంచడం నాలుగోసారి. తాజాగా సెలేరియో మోడల్ మినహా అన్ని కార్ల ధరలు 1.9 శాతం పెంచుతున్నామని ఇంతకుముందే ప్రకటించింది. ఈ నిర్ణయం సోమవారం నుంచి అమలులోకి వచ్చింది.
కార్ల ధరలు పెరుగడానికి మారుతి సుజుకి మూడు కారణాలు చెబుతోంది. అందులో మొదటిది స్టీల్ ధరలు ఏడాదిలో 50 శాతం పెరిగాయి.. రెండో కారణం సెమీ కండక్టర్ల కొరత. కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వాటికి డిమాండ్ ఎక్కువైంది. ఫలితంగా మార్కెట్లో కొరత ఏర్పడటంతో అధిక ధరలకు సెమీ కండక్టర్లు, చిప్లు కొనుగోలు చేయాల్సి వస్తున్నదని వాదిస్తున్నది. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడంతో కార్ల రవాణా వ్యయ భరితంగా మారింది. ఈ కారణాలతోనే ధరలు పెంచేశామని మారుతి తెలిపింది.
ఈ ఏడాది జనవరిలో తొలిసారి కొన్ని ఎంపిక చేసిన కార్ల ధరలు గరిష్ఠంగా రూ.34 వేలు పెంచేసింది మారుతి సుజుకి. ఏప్రిల్లో రెండో దఫా 1.6 శాతం అంటే రూ.22,500 వరకు పెంచింది. ముచ్చటగా మూడోసారి జూలైలో స్విఫ్ట్ హాచ్బ్యాక్తోపాటు అన్ని సీఎన్జీ మోడల్ కార్ల ధరలను పెంచింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tesla HatchBach Affordable| 2023లో చౌకగా హ్యాచ్బ్యాక్ టెస్లా కారు.. ధరెంతంటే?!
Ola vs Tesla | టెస్లాకు ముందే అమెరికాలోకి ఓలా స్కూటర్ ఎంట్రీ.. ?!
క్రెడిట్ కార్డుతో జర జాగ్రత్త
Relief for senior citizens | వృద్ధులకు రిలీఫ్.. నో ఐటీఆర్!