బీజింగ్: ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబాపై తాజాగా 275 కోట్ల డాలర్ల ఫైన్ విధించిన చైనా.. తమ దేశంలోని 34 టెక్ సంస్థలకు మంగళవారం హెచ్చరికలు పంపింది. గుత్తాధిపత్య నిబంధనలు అమలు చేయొద్దని, తమ వేదికల నుంచే వస్తువులు, సరుకులు కొనుగోలు చేయొద్దని స్పష్టం చేసింది. ఇలా హెచ్చరికలు అందుకున్న సంస్థల్లో టెన్సెంట్, బైట్డ్యాన్స్, జేడీ డాట్ కాం తదితరాలు ఉన్నాయి.
ది స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ (ఎస్ఎఎంఆర్) ఈ మేరకు 34 టెక్ సంస్థలకు సమన్లు జారీ చేసింది. నెల రోజుల్లో స్వీయ తనిఖీలు చేపట్టి, తప్పొప్పులు సరిదిద్దుకోవాలని ఆయా సంస్థలతో జరిగిన సమావేశంలో ఎస్ఎఎంఆర్ స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే తీవ్ర శిక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
శనివారం ఆలీబాబాపై ఎస్ఏఎంఆర్ 18.2 బిలియన్ డాలర్ల జరిమాన విధించిన సంగతి తెలిసిందే. ఇది ఇతర టెక్ సంస్థలకు హెచ్చరికగా పరిగణించాలని మంగళవారం ఎస్ఏఎంఆర్ వెల్లడించింది.
టెక్ సంస్థలతో జరిగిన సమావేశంలో చైనా సైబర్స్పేస్ రెగ్యులేటర్ అండ్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కూడా పాల్గొన్నారు. సెర్చింజన్ బైదూ, ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ మితువాన్ తదితర సంస్థల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక ముందు తాము, తమ సిబ్బంది నిబంధనలను మరింత కఠినతరం అమలు చేస్తామని ఎస్ఏఎంఆర్ వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
బిట్ కాయిన్ ఆల్టైం రికార్డు@62,377 డాలర్లు!
తెలుగు ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని ఉగాది శుభాకాంక్షలు
ఇదెక్కడి పోయేకాలం.. యువకుడి జననాంగం కోసేసిన నపుంసకులు..!
దేశంలో కరోనా విలయం.. కొత్తగా 1.61లక్షల కేసులు
రెండు కాళ్లు, మూడు చేతులతో.. ఒడిశాలో జన్మించిన అవిభక్త కవలలు
రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు
IPL 2021:టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్కతా
IPL 2021:టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్కతా
బాయ్ఫ్రెండ్తో ఐరాఖాన్ బాక్సింగ్..వీడియో వైరల్
కొవిడ్ అంతానికి చాలా సమయం పడుతుంది: డబ్ల్యూహెచ్ఓ
అంత తక్కువ ధరకు మా వ్యాక్సిన్ అమ్మలేం: ఆర్డీఐఎఫ్