చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా చెపాక్ మైదానంలో మరికాసేపట్లో కోల్కతా నైట్రైడర్స్, ముంబై ఇండియన్స్ అమీతుమీతేల్చుకోనున్నాయి. టాస్ గెలిచిన కోల్కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని మోర్గాన్ తెలిపాడు. క్రిస్లిన్ స్థానంలో క్వింటన్ డికాక్ జట్టులోకి వచ్చినట్లు ముంబై సారథి రోహిత్ శర్మ చెప్పాడు.
సన్రైజర్స్ హైదరాబాద్తో తమ లీగ్ తొలి మ్యాచ్లో కోల్కతా 10 పరుగుల తేడాతో గెలిచింది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో టోర్నీ ఆరంభ మ్యాచ్లో బ్యాటింగ్లో విఫలమైన ముంబై ఇండియన్స్ ఓటమితో లీగ్ను ఆరంభించింది. లీగ్లో బోణీ కొట్టాలని రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై పట్టుదలతో ఉండగా, వరుసగా రెండో మ్యాచ్లో గెలుపొందాలని మోర్గాన్సేన భావిస్తోంది.