IT Returns | గత ఆర్థిక సంవత్సరా (2021-22) నికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి మరో కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది.. గడువు పొడిగించేది లేదని కేంద్రం తెగేసి చెప్పింది. దీంతో వేతన జీవులు, పన్ను చెల్లింపుదారుల్లో వేగం పెరిగింది. ఆదివారం ఒక్కరోజే రాత్రి ఎనిమిది గంటల సమయానికి 53,98,348 మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల్లోపు 4,95,505 మంది ఐటీఆర్లు సబ్మిట్ చేశారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారికి సాయపడేందుకు ఆదాయం పన్ను విభాగం 1800 103 0025, 1800 419 0025 ఫోన్ నంబర్లు అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్లో యూజర్లు orm@cpc.incometax.gov.in అనే ఈ-మెయిల్ అడ్రస్ ద్వారా తమను సంప్రదించవచ్చునని తెలిపింది.
అంతకుముందు ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 43,99,038 మంది ఐటీ రిటర్న్స్ సమర్పించారు. వారిలో ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు 5,17,030 మంది ఐటీఆర్లు సబ్మిట్ చేశారు. నాలుగు గంటల సమయానికి 33,73,975 మంది (మధ్యాహ్నం 3 నుంచి నాలుగు గంటల మధ్య 4,73,228 మంది) ఐటీఆర్లు సమర్పించారు.
ఇప్పటికే ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువు పొడిగించేది లేదని ఆదాయం పన్ను విభాగం ఎప్పటికప్పుడు ట్వీట్ల ద్వారా తెలియజేస్తున్నది. ఆదివారం (2022 జూలై 31) అర్థరాత్రి దాటితే మాత్రం రూ.5 లక్షలకు పైగా ఆదాయం గల వారు రూ.5000, రూ.5 లక్షల్లోపు ఆదాయం గల వారు రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ నెలాఖరు వరకు ఐటీఆర్లు సబ్మిట్ చేయొచ్చు. అయితే, వారు చెల్లించే ఆదాయం పన్నుపై ఒకశాతం వడ్డీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే పన్ను పరిమితికి లోబడి ఉన్న వారికి మాత్రం లేట్ ఫీజు వర్తించదు.
Statistics of Income Tax Returns filed today.
53,98,348 #ITRs have been filed upto 2000 hours today & 4,95,505 #ITRs filed in the last 1hr.
For any assistance, pl connect on orm@cpc.incometax.gov.in or on our help desk nos 1800 103 0025 & 1800 419 0025.
We will be glad to assist!— Income Tax India (@IncomeTaxIndia) July 31, 2022