న్యూఢిల్లీ : దసరా వేడుకల సందర్భంగా దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) ఉద్యోగులకు తీపికబురు అందించింది. నవంబర్ 1 నుంచి ఉద్యోగులకు వేతన పెంపు చేపట్టనుంది. కంపెనీ హెచ్ఆర్ చీఫ్ షజి మ్యాథ్యూ టౌన్హాల్ మీటింగ్ సందర్భంగా ఈ విషయం వెల్లడించారు. గత కొద్దినెలలుగా ఇన్ఫోసిస్ వార్షిక వేతన పెంపును వాయిదా వేస్తున్న క్రమంలో కంపెనీ ఈ ప్రకటన చేయడంతో టెకీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇన్ఫోసిస్ సహజంగా సీనియర్ మేనేజ్మెంట్ దిగువన ఉద్యోగులకు ఏటా ఏప్రిల్లో, ఇతరులకు జులైలో వేతన పెంపు చేపడుతుంది. ఐటీ పరిశ్రమలో ప్రతికూల పరిస్ధితుల దృష్ట్యా ఈ ఏడాది వేతన పెంపును కంపెనీ వాయిదా వేస్తూ వచ్చింది. వేతన పెంపును వాయిదా వేసేందుకు కంపెనీలో నెలకొన్న సామర్ధ్య లేమి కారణమని ఇన్వెస్టర్ కాల్ సందర్భంగా ఇన్ఫోసిస్ సీఎఫ్వో నిలంజన్ రాయ్ చెప్పుకొచ్చారు.
ఈ చర్యలతో కంపెనీ మార్జిన్లలో 50 బేసిస్ పాయింట్ల మెరుగుదల సాధ్యమైందని అన్నారు. ఇక ఈ ఏడాది వేతన పెంపుతో పాటు ఉద్యోగుల సేవలను మెరుగైన రీతిలో వాడుకోవడం, ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్మెంట్కు చెక్ పెట్టడం వంటి చర్యలు ఇన్ఫోసిస్ చేపడుతోంది.
Read More :
Festive Season | మార్కెట్లకు పండుగల జోష్.. డిసెంబర్ 31 నాటికి రూ.8.5లక్షల కోట్ల టర్నోవర్..!