Festive Season | దేశంలో పండుగ సీజన్ కొనసాగుతున్నది. రాబోయే రోజుల్లో పెళ్లిళ్ల సీజన్ మొదలుకానున్నది. ఈ క్రమంలో దేశంలోని మార్కెట్లన్నీ సందడిగా మారనున్నాయి. అయితే, ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి రూ.8.5లక్షల కోట్ల టర్నోవర్ ఉంటుందని.. 60కోట్లకుపైగా వినియోగదారులు కొనుగోళ్లు జరుపనున్నట్లు అంచనా. విశేషం ఏటంటే ఈ సారి చైనీస్ ఉత్పత్తులు విక్రయించడం లేదని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే రూ.90వేలకోట్ల ఆన్లైన్ వ్యాపారం కంటే దుకాణాల్లోనే వ్యాపారం తొమ్మిది రెట్లు అధికంగా జరుగునుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు.
ఇంతకు ముందు చైనీస్ వస్తువులకు డిమాండ్ తగ్గిందని, గతంలో వినియోగదారులు ఆయా ఉత్పత్తులను కావాలని డిమాండ్ చేసే వారని.. వాటిని కొనుగోలు చేయడం మానేశారని పేర్కొన్నారు. రక్షాబంధన్తో మొదలైన పండుగ సీజన్లో దాదాపు రూ.3లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని, ఆ తర్వాత పెళ్లిళ్ల సీజన్లో రూ.4.25లక్షల కోట్లు, క్రిస్మస్తో పాటు న్యూ ఇయర్లో రూ.2.25లక్షల కోట్ల వ్యాపారం జరుగనున్నది.
దీంతో దేశ రిటైల్ పరిశ్రమ కొత్త ఊపునిచ్చినట్లేనని.. దాంతో మార్కెట్ సెంటిమెంట్ పెరగడంతో పాటు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. క్యాటరింగర్పై అత్యధికంగా జనం 30శాతం ఖర్చు చేస్తుండగా.. వ్యాపారంలో దాదాపు 8శాతం బంగారం, వెండిపై.. 10శాతం బహుమతులు, ఆరుశాతం అలంకరణ వస్తువులు, 30శాతం ఫుడ్, క్యాటరింగ్, 10శాతం ఎలక్ట్రానిక్స్పై ఖర్చు చేస్తున్నట్లు క్యాట్ చైర్మన్ బీసీ భారతీయా తెలిపారు. 10శాతం బట్టలు, 5శాతం ఫర్నిషింగ్, ఆరుశాతం ఈవెంట్ మేనేజ్మెంట్, 10శాతం ఇతర వస్తువుల కొనుగోలుపై వినియోగదారులు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు.