హైదరాబాద్, ఢిల్లీలో ప్రారంభించిన ఇండిగో
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: హైదరాబాద్, ఢిల్లీల్లో డోర్-టు-డోర్ బ్యాగేజ్ బదిలీ సేవల్ని ప్రారంభించినట్లు దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది. ప్రయాణీకుల లగేజీని భద్రంగా వారివారి ఇండ్లకు చేరుస్తామని పేర్కొన్నది. లగేజీ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ట్రాకింగ్ వ్యవస్థ కూడా ఉంటుందని తెలిపింది. ఈ సదుపాయంలో రూ.5వేల విలువైన బ్యాగేజీ బీమా సౌకర్యం కూడా కలిసి ఉంటుందని వివరించింది. అలాగే విమానం బయలుదేరడానికి 24 గంటల ముందుదాకా ఈ సర్వీసును ప్రయాణీకులు ఎప్పుడైనా పొందవచ్చన్నది. కాగా, ‘6ఈబ్యాగ్పోర్ట్’ పేరుతో మొదలైన ఈ నిరంతర సర్వీస్ను ముంబై, బెంగళూరుల్లో కార్టర్పోర్టర్ భాగస్వామ్యంతో త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు ఇండిగో ఈ సందర్భంగా ఓ ప్రకటనలో తెలియజేసింది. కార్టర్ఎక్స్ వేదిక www. 6EBagPort. carterporter.in ద్వారా కూడా కస్టమర్లు ఈ సేవల్ని అందుకునే వీలుందని చెప్పింది.
ఇవి కూడా చదవండి..
రిలయన్స్-ఫ్యూచర్ డీల్కు 6 నెలల గడువు