Mukesh Ambani | ఫైనాన్సియల్ వరల్డ్ను బ్లాక్ చైన్ టెక్నాలజీ పునర్నిర్వచిస్తుందని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. డిజిటల్ సొసైటీ పునాదులపై దేశంలో డిజిటల్-ఫస్ట్ రివల్యూషన్ ఆవిష్కృతం కానున్నదని అన్నారు. ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ అథారిటీ (ఐఎఫ్ఎస్సీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఇనిఫిటి ఫోరం వద్ద ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీతో బ్లాక్ చైన్ టెక్నాలజీ విభిన్నం అని స్పష్టం చేశారు. ట్రస్ట్ బేస్డ్ సొసైటీలో ట్రస్ట్ ఆధారిత లావాదేవీలకు బ్లాక్ చైన్ టెక్నాలజీ చాలా ముఖ్యమైన ఫ్రేమ్ వర్క్ రూపకల్పనకు భూమిక కానున్నదన్నారు.
డేటా ప్రైవసీ బిల్లు, క్రిప్టో కరెన్సీ బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్ట నున్న నేపథ్యంలో ముకేశ్ అంబానీ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. భారత్లో డిజిటల్ రివల్యూషన్ క్రెడిట్ ప్రధాని నరేంద్రమోదీకి చెల్లుతుందని, అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ముకేశ్ అంబానీ చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ కాన్సెప్ట్తో రూపుదిద్దుకున్న గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ చాలా కాలం క్రితమే పనులు ప్రారంభించిందని, ఇప్పుడది వాస్తవ రూపం దాల్చిందన్నారు.
మనం నాలుగో రివల్యూషన్కు సాక్షులుగా ఉన్నాం. డిజిటల్-ఫస్ట్ రివల్యూషన్లో కోట్లాది మంది భారతీయుల జీవితంలో డిజిటల్ భాగం కానున్నదని అని ముకేశ్ అంబానీ తెలిపారు. టెక్నాలజీలోని ఐదారు అంశాలు సమ్మిళితమైతే యావత్ ప్రపంచం పరివర్తన చెందుతుందన్నారు. భవిష్యత్లో వర్చువల్ ప్లేస్కు అద్భుతమైన విలువ లభిస్తుందని చెప్పారు.
వాస్తవంగా డేటా నూతన ఇంధనం కానున్నదని, ఇది ప్రతి ఒక్కరిదని, ప్రతి ఒక్కరూ దానికి యజమానులు కావడంతోపాటు వినియోగించుకుంటారని అన్నారు. వచ్చే ఏడాది 5జీ సేవల ప్రారంభంతో ప్రపంచంలోనే అత్యంత ఆధునిక డిజిటల్ టెక్నాలజీ గల దేశంగా భారత్ ఆవిర్భవిస్తుందని, దీనికి జియో సారధ్యం వహిస్తుందని ముకేశ్ అంబానీ అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
హైదరాబాద్లో బడ్జెట్ ధరలో టేస్టీ దోశ, ఇడ్లీ తినాలంటే.. అక్కడికి వెళ్లాల్సిందే
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం అదే.. పారిస్ కూడా దాని తర్వాతే!
మట్టితో ఇంటిని నిర్మించాడు.. ఆ ఇల్లు స్పెషాలిటీ ఏంటో తెలుసా?
డ్రైవర్లకు పోలీసుల ‘గరమ్ చాయ్’.. ఎందుకంటే?