Crypto Currency | క్రిప్టో కరెన్సీలను కట్టడి చేయడానికి, వాటిల్లో మదుపర్లు పెట్టుబడి పెట్టకుండా నిరుత్సాహ పరిచేందుకు కేంద్రం సిద్ధమైంది. అందుకోసం నిబంధనలను కఠినతరం చేయనున్నది. క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడి పెట్టాలని భావించే వారు ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ కావడానికి, ట్రేడింగ్కు ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందని అధికార వర్గాల కథనం.
ముందస్తు వెరిఫికేషన్ నిబంధన పెట్టడం వల్ల ఒక సంస్థ నుంచి మరో సంస్థకు, ఇన్వెస్టర్ల మధ్య లావాదేవీలకు అడ్డంకులు ఏర్పడతాయి. ప్రభుత్వ అప్రూవల్ పొందిన క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టాలి. అలా కాకుండా ప్రభుత్వ అనుమతి లేని క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడి పెడితే మాత్రం పెనాల్టీలు చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాల కథనం.
ఇక క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడి ద్వారా వచ్చే లాభాలపై 40 శాతానికి పైగా పన్ను చెల్లించాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. ఈ మేరకు ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చట్టం తీసుకురానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.
దీనిపై స్పందించడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అందుబాటులోకి రాలేదు. ఇటీవల కర్ణాటకలో బిట్ కాయిన్ స్కామ్ వెలుగు చూసిన నేపథ్యంలో క్రిప్టోల కట్టడికి అనుసరించాల్సిన వ్యూహంపై గతవారం ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
WhatsApp : వాట్సప్లో సరికొత్త ఫీచర్.. గ్లోబల్ పేమెంట్ ట్రాన్స్ఫర్ కోసం డిజిటల్ వాలెట్
WhatsApp : వాట్సప్లో సరికొత్త ఫీచర్.. మల్టీ డివైజ్ సపోర్ట్.. ఎనేబుల్ చేసుకోండిలా
WhatsApp : మీ నెంబర్ కే వాట్సప్ మెసేజ్ పంపించుకోవడం ఎలా? ముఖ్యమైన సమాచారం ఉంటే ఇలా షేర్ చేసుకోండి
లాస్ట్ సీన్.. ఎవరు చూడాలనేది ఇక మన ఇష్టం
WhatsApp : 2021 ముగిసేనాటికి ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు.. ఇదిగో ఆ లిస్టు!