Anil Ambani | బ్యాంకులకు రుణాల ఎగవేత కేసుల్లో రిలయన్స్గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఆయనను ఆగస్టు 5న విచారణకు రావాల్సిందిగా ఆదేశించిన ఈడీ.. రూ. 3 వేల కోట్ల రుణ మోసం కేసు (Loan Fraud Case)లో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అనిల్ అంబానీ కంపెనీలకు రుణాలు ఇచ్చిన బ్యాంకులకు ఈడీ లేఖ రాసింది.
రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్కు రుణాలు ఇచ్చిన 12-13 ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు ఈడీ తాజాగా లేఖలు రాసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యూకో, పంజాబ్, సింద్ బ్యాంక్ల నుంచి రుణాల ఎగవేతకు సంబంధించిన వివరాలను తమకు ఇవ్వాలని కోరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఈ రుణాలకు సంబంధించి కొంత మంది బ్యాంకు అధికారులను కూడా ఈడీ పశ్నించే అవకాశం ఉందని తెలిసింది.
కాగా, 2017 నుంచి 2019 వరకు ఎస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాలను అక్రమంగా దారి మళ్లించారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. గ్రూపు కంపెనీలకు రుణాలు ఇవ్వడానికి ముందు బ్యాంక్ ప్రమోటర్లతో సంబంధం ఉన్న సంస్థలకు నిధులు బదిలీ అయ్యాయని ఈడీ అధికారులు గుర్తించారు. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్కు సంబంధించిన విషయాలను ఈడీతో అధికారులు పంచుకున్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,742.60 కోట్లుగా ఉన్న కార్పొరేట్ రుణ వితరణ ఆ మరుసటి ఏడాదికిగాను రూ.8,670 కోట్లకు పెరిగింది.
రుణ ఎగవేతకు సంబంధించి అనిల్ అంబానీకి సంబంధించిన కంపెనీలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు.. పలు కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరిశీలించిన దర్యాప్తు అధికారులు.. అనిల్ అంబానీకి సమన్లు పంపారు. ఈ నెల 5న న్యూఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో చారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈడీ విచారణ నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా ఉండేందుకు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది.
Also Read..
అనిల్ అంబానీ కేసులో ఈడీ దూకుడు
అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసులు.. ఈ నెల 5న హాజరుకావాలని ఆదేశం
Chain Snatched | మార్నింగ్ వాక్ చేస్తుండగా.. కాంగ్రెస్ ఎంపీ మెడలో చైన్ లాక్కెళ్లిన దుండగుడు