ముంబై, జూన్ 22: దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్..కొనుగోలుదారులకు షాకిచ్చింది. వచ్చే నెలలో అన్ని రకాల వాహన ధరలను రూ.3 వేల వరకు పెంచబోతున్నట్లు మంగళవారం ప్రకటించింది. కమోడిటీ ధరలు పెరుగడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో వచ్చే నెల 1 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని షోరూంలలో మోటర్సైకిల్, స్కూటర్లు మరింత ప్రియంకానున్నాయి. ఎంతమేర పెంచుతున్నదో మాత్రం సంస్థ వెల్లడించలేదు.