LIC IPO | కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో వాటాల ఉపసంహరణ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వ వ్యూహం మారిందా.. అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు.. ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. లక్ష కోట్ల నిధులను సమీకరించాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. ప్రతిపాదిత ఐపీవోను రెండు సార్లు తీసుకు రావాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం.
రెండు ఐపీవోల మధ్య కొన్ని నెలల గడువు తీసుకోవాలని కేంద్రం సంకల్పించినట్లు తెలుస్తున్నది. భారీ మొత్తంలో నిధుల సేకరణకు చేపట్టే ఎల్ఐసీ ఐపీవోను స్టాక్ మార్కెట్లు భరించలేవన్న అభిప్రాయం కూడా వినిపిస్తున్నది.
ప్రస్తుతం సెబీ నిబంధనల ప్రకారం ఒక ఐపీవో ద్వారా 18 నెలల్లో 20% లోపే వాటాలను విక్రయించవచ్చు. రూ.లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ గల భారీ సంస్థలు 10 శాతం వాటాలపై మాత్రమే ఐపీవో ద్వారా నిధులు సేకరించొచ్చు.
దేశ చరిత్రలోనే అతి పెద్ద ఐపీవోగా ఎల్ఐసీ ఐపీవో నిలువనున్నది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు, మార్క్యూ అసెట్ మేనేజర్లు భారీగా నిధులతో సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ ఐపీవో కనుక ముందస్తుగా ఇన్వెస్టర్ల షేర్ల కొనుగోళ్లకు అనుమతించకపోవచ్చు.
ఇప్పటికే 2021లో 25 సంస్థలకు పైగా ఐపీవోలు మార్కెట్ను తాకాయి. రూ.70 వేల కోట్ల నిధులు సేకరించాయి. త్వరలో మార్కెట్లోకి రానున్న పేటీఎం ఐపీవో ద్వారా రూ.16,600 కోట్ల నిధుల సేకరణ లక్ష్యం. 2010లో కోల్ ఇండియా అప్పట్లో గరిష్ఠంగా రూ.15,475 కోట్ల నిధులు ఐపీవో ద్వారా సేకరించింది. అయితే, ఎల్ ఐసీ ఐపీవోను సక్సెస్ చేసేందుకు అన్ని ఆప్షన్లను సిద్ధం చేశామని ఆ సంస్థ అధికారులు తెలిపారు.
Paytm’s IPO | పేటీఎంకు షాక్.. ఐపీవోకు అనుమతి లభిస్తుందా.. ఎందుకంటే?!!
Electric vehicles | పెట్రో ధరల పెంపు ఎఫెక్ట్.. మార్కెట్లోకి దూసుకొస్తున్న స్టార్టప్ కంపెనీలు
Huzurabad | ఈటలకు షాక్.. ‘గెల్లు’కే మా ఓటన్న ముదిరాజ్లు
Vinesh Phogat: రెజ్లింగ్కు తిరిగొస్తానో లేదో.. తీవ్ర నిరాశలో వినేష్ ఫోగాట్