న్యూఢిల్లీ: బంగారం కొనుగోలు దారులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి కొనుగోలు చేసే బంగారు ఆభరణాలపై హాల్మార్క్ తప్పనిసరని ఇంతకుముందు పేర్కొన్న కేంద్రం.. తాజాగా ఆ గడువును పొడిగించింది. కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా విశ్వరూపం ప్రదర్శిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నది.
కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో ఆభరణాల తయారీ దారులకు మరింత సమయం ఇవ్వాలని వివిధ వర్గాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.
దీని ప్రకారం వచ్చేనెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు హాల్మార్కింగ్ గడువు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. అయితే, బంగారం ఆభరణాల వ్యాపారులు కేవలం 14, 18, 22 క్యారెట్ల బంగారం ఆభరణాలను విక్రయించేందుకు అనుమతినిస్తారు.
బంగారం కొనుగోలు దారులను ఆభరణాల వ్యాపారులు మోసగించకుండా హాల్ మార్కింగ్ తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఇందుకు అనుగుణంగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్)లో ఆభరణాల వ్యాపారులు తమ సంస్థల పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి.
రాబోయే 12 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా ‘యాస్’
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నెలలో 13వ సారి పెంపు
రేపు సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్లో పాక్షికమే!
కరోనాపై మాటల్లోనే భయం.. చేతల్లో లేదు
తృణమూల్ పద్మవ్యూహంలో బీజేపీ ఉక్కిరిబిక్కిరి!
రేపు సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్లో పాక్షికమే!
చోక్సీ కొత్త ఎత్తు.. అంటిగ్వా నుంచి క్యూబాకు మకాం మార్పు!
టాటా స్టీల్ మహా ఔదార్యం.. కంపెనీపై కురుస్తున్న ప్రశంసల జల్లు
కరోనా నుండి కోలుకున్న జూనియర్ ఎన్టీఆర్
గంటకు రూ.75 కోట్లు పెరిగిన గౌతం ఆదానీ సంపద!
మలేషియాలో రెండు రైళ్ల ఢీ.. 213 మందికి గాయాలు
డైమండ్ ట్రేడర్ నుంచి.. ఆసియా బిలియనీర్ వరకూ..!!
లక్షల కోట్ల పెట్టుబడులు పెడతాం.. అనుమతించండి మోదీజీ – విస్మయం కలిగిస్తున్న పత్రికా ప్రకటన