న్యూఢిల్లీ, జూన్ 29: ఠారెత్తిస్తున్న వంటనూనెల ధరలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి. ముడి పామాయిల్పై దిగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గిస్తూ మంగళవారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇతర పామాయిల్స్పైనా సుంకాన్ని 37.5 శాతానికి కోత పెట్టింది. ఇంతకుముందు ముడి పామాయిల్పై కనీస కస్టమ్స్ డ్యూటీ 15 శాతం, ఇతర పామాయిల్స్పై 45 శాతం చొప్పున ఉన్నాయి. కాగా, బుధవారం నుంచి అమల్లోకి వస్తున్న ఈ కొత్త సుంకాలు.. సెప్టెంబర్ 30దాకా మూడు నెలలపాటు వర్తిస్తాయని పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్ర బోర్డు పేర్కొన్నది. బహిరంగ మార్కెట్లో ఆయా వంటనూనెల ధరలు రకం, బ్రాండ్లనుబట్టి లీటర్ రూ.100 నుంచి 200 పలుకుతున్న విషయం తెలిసిందే.