న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు ఇవాళ ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర ( Gold rate today ) రూ.14 పెరిగి రూ.45,080కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.45,066గా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లు ఫ్లాట్గా ముగియడమే దేశీయంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక వెండి ధరలు కూడా ఇవాళ స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర కేవలం రూ.98 పెరిగి రూ.58,890కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.58,792 వద్ద ముగిసింది. మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ ఇవాళ 34 పైసలు బలహీనపడి 73.82 లకు చేరింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర ఇవాళ 1,753 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి 22.47 అమెరికన్ డాలర్లు పలికింది.