న్యూఢిల్లీ: దేశంలో గత కొన్ని రోజులుగా అంతకంతకే పెరుగుతూ రూ.50 వేల మార్కును దాటిన బంగారం ధర ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.188 తగ్గి రూ.46,460కి చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,272 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గడమే దేశీయంగా బంగారం ధరలు తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
హైదారాబాద్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.48,270గా, 10 గ్రాముల 22 క్యారట్ బంగారం ధర రూ.44,250గా ఉన్నది. కాగా, ఢిల్లీలో కిలో వెండి ధర ఇవాళ స్వల్పంగా పెరిగింది. కిలో వెండి రూ.173 పెరిగి రూ.67,658కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి రూ.67,485 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1791 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 26.35 అమెరికన్ డాలర్లు పలికింది.