Garments Costly from January | వచ్చే ఏడాది నుంచి రూ.1000 లోపు విలువ గల గార్మెంట్స్ ధరలు పెరగనున్నాయి. గార్మెంట్స్ ఇండస్ట్రీలో 85 శాతం రూ.1000 లోపు విలువ గలవే ఉంటాయి. ఎందుకంటే ఇప్పటి వరకు దానిపై అమలు చేసిన ఐదు శాతం జీఎస్టీ స్లాబ్ 12 శాతానికి పెరుగనున్నది.
ఈ మేరకు ఈ నెల 18న రూ.1000 విలువ గల గార్మెంట్స్ మీద జీఎస్టీ శ్లాబ్ను 12 శాతానికి పెంచుతూ నోటిఫికేషన్ జారీ అయ్యింది. అంటే రూ.1000 విలువ దాటిన గార్మెంట్స్ మీద కూడా 12 శాతం జీఎస్టీని కేంద్రం వసూలు చేస్తుందని ఐసీసీ చైర్మన్ సంజయ్ కే జైన్ తెలిపారు. పేద వారు కూడా ఇక నుంచి తమ దుస్తులపై 7 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇది ద్రవ్యోల్బణానికి దారి తీస్తుందన్నారు.
ఇప్పటికే నూలు ధర 25 శాతం పెరిగింది. రూ.1000 లోపు విలువ గల గార్మెంట్స్పై జీఎస్టీ పెంచడంతో నూలుపై వచ్చే ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) సాయపడదని సంజయ్ కే జైన్ వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏటా గార్మెంట్ ఇండస్ట్రీ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు ఉంటే, జీఎస్టీ భారం రూ.8.5 లక్షల కోట్లపై పడుతుందని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వజ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మహిళ రాధిక మన్నె.. ఎవరామె.. ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటి?
jai bhim | ఈమెదీ చినతల్లి లాంటి కథే.. కానీ న్యాయం ఇంకా జరగలేదు !
Password : ఇండియన్స్ కామన్గా వాడే పాస్వర్డ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Red crabs : కోట్ల సంఖ్యలో రోడ్ల మీదికొచ్చిన పీతలు.. స్థంభించిన జనజీవనం.. ఎక్కడో తెలుసా?
బిచ్చగాడి అంతిమయాత్రకు భారీగా జనం.. కారణం ఏంటి?