సంగారెడ్డి: జిల్లాలోని నారాయణఖేడ్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. పట్టణంలోని రాజీవ్ చౌక్లో అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. కారు బీభత్సానికి విద్యుత్ స్తంభాలు, పాన్ డబ్బాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతులను పారిశుద్ధ్య కార్మికురాలైన సత్తమ్మ, వెంకమ్మగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.