(5G Services) న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నుంచి 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలుత ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై వంటి మహానగరాలు, గురుగ్రామ్, బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్, పుణె వంటి పెద్ద నగరాల్లో సేవలు లభించనున్నాయి. 2022 మార్చి-ఏప్రిల్లో 5జీ స్పెక్ట్రమ్ను ప్రభుత్వం వేలం వేయనున్నది. ఈ విషయాలను కేంద్ర టెలికాం శాఖ వెల్లడించింది.
ఈ ఏడాది సెప్టెంబర్లో స్పెక్ట్రమ్ వేలం కోసం రిజర్వ్ ధర, బ్యాండ్ ప్లాన్, బ్లాక్ సైజు, స్పెక్ట్రమ్ లభ్యతపై టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటర్ అథారిటీ (ట్రాయ్) నుంచి టెలికమ్యూనికేషన్ల శాఖ సిఫార్సులు కోరింది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా సంస్థల ద్వారా 5 జీ ట్రయల్స్ నిర్వహించారు. గురుగ్రామ్, బెంగళూరు, కోల్కతా, ముంబై, చండీగఢ్లో 5జీ ట్రయల్ సైట్లను ఈ సంస్థలు ఏర్పాటు చేశాయి. ఢిల్లీ, జామ్నగర్, అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, లక్నో, పుణె, గాంధీనగర్తోపాటు ఇతర పెద్ద నగరాల్లో వచ్చే ఏడాది 5జీ సేవలు ప్రారంభించనున్నారు.
5జీ వేగం 4జీ కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 5జీ సేవలు డిజిటల్ విప్లవానికి కొత్త కోణాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేయడమే కాకుండా, ఈ-గవర్నెన్స్ను విస్తరించేందుకు అవకాశం కల్పిస్తున్నది. 5జీ సేవలు అందుబాటులోకి రావడంతో వివిధ పనులను మెరుగుపర్చుకోవడంతోపాటు సులభతరం చేసుకునేందుకు సహాయపడనున్నది.
జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..