క్రెడాయ్ కొత్త ప్రెసిడెంట్ పటోడియా ప్రకటన
ముంబై, మార్చి 30: రియల్ ఎస్టేట్ వ్యాపారుల సమాఖ్య క్రెడాయ్ (కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) కొత్త నేషనల్ ప్రెసిడెంట్గా కోల్కతాకు చెందిన యూనీమార్క్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ హర్షవర్ధన్ పటోడియా ఎంపికయ్యారు. ఏప్రిల్ 1 నుంచి రెండేండ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని క్రెడాయ్ మంగళవారం వెల్లడించింది. ప్రస్తుతం నేషనల్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న సతీశ్ మగర్ పదవీ కాలం బుధవారం (మార్చి 31)తో ముగుస్తుందని, దీంతో ఆయన ఇకపై క్రెడాయ్ నేషనల్ చైర్మన్గా వ్యవహరిస్తారని తెలిపింది. ఇదిలావుంటే, దేశవ్యాప్తంగా క్రెడాయ్లో సభ్యులుగా ఉన్న రియల్ ఎస్టేట్ డెవలపర్ల సైట్లలోని నిర్మాణ కార్మికులకు ఉచితంగా కొవిడ్-19 టీకా పంపిణీ చేయనున్నట్లు పటోడియా తన తొలి ప్రసంగంలో ప్రకటించారు. దీంతో దాదాపు 2.5 కోట్ల మంది నిర్మాణ కార్మికులకు లబ్ధి చేకూరుతుందని క్రెడాయ్ పేర్కొన్నది.
ఇవి కూడా చదవండి: