హైదరాబాద్, మార్చి 30: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ కల్యాణ్ జ్యూవెల్లరీ..క్రమంగా తన వ్యాపారాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నది. కంపెనీ వాటా విక్రయం(ఐపీవో)తో వచ్చిన భారీ నిధులను ఇలా వ్యాపార విస్తరణకు వినియోగిస్తున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఒకేరోజు 14 షోరూంలను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. దీంతో రిటైల్ అవుట్లెట్ల సంఖ్య 151కి చేరుకోనున్నది. నూతనంగా ప్రారంభించే షోరూంలలో తెలంగాణలో కరీంనగర్, ఖమ్మంలతోపాటు నోయిడా, నాసిక్, జామ్నగర్, కేరళ, తమిళనాడుల్లో రెండు షోరూంలని కంపెనీ సీఎండీ టీఎస్ కల్యానరామన్ తెలిపారు. ఐపీవోతో సంస్థ రూ.1,175 కోట్ల నిధులను సేకరించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి: