న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్..ప్రస్తుత సంవత్సరంలో 25 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్టు ప్రకటించంది. వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా 2026లో 24వేల నుంచి 25 వేల మందిని రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నట్టు కంపెనీ సీఈవో రవి కుమార్ ఎస్ తెలిపారు.
2025లో నియమించుకున్న 20 వేల మందితో పోలిస్తే 20 శాతం అధికమని ఆయన పేర్కొన్నారు. కొత్తగా నియమించుకునే వారిలో ఏఐ టెక్నాలజీపై మంచి పట్టున్న వారిని తీసుకోనున్నట్టు చెప్పారు. గతేడాది కంపెనీ ఆదాయంలో 6.4 శాతం వృద్ధి నమోదైందని, అలాగే ఒక్కో ఉద్యోగం నుంచి వచ్చే ఆదాయంలో 5 శాతం పెరిగిందన్నారు.