న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: దేశవ్యాప్తంగా 2.5 కోట్లమంది మరణించిన వారి ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసినట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరణించిన వ్యక్తుల ఆధార్ గుర్తింపు దుర్వినియోగాన్ని ఆపేందుకు, మోసాలను నివారించేందుకు ఈ చర్యను చేపట్టినట్టు పేర్కొన్నది.
ఆధార్ డాటాబేస్ను కచ్చితమైన, విశ్వసనీయమైనదిగా ఉంచేందుకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న డ్రైవ్లో ఇది ఒక భాగమని తెలిపింది. ప్రస్తుతం దేశంలో దాదాపు 134 కోట్లమంది క్రియాశీల ఆధార్ హోల్డర్లు ఉన్నారు.