ముంబై : టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ (Bharti Airtel) జూన్ త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది. త్రైమాసిక ప్రాతిపదికన కంపెనీ లాభం 63 శాతం క్షీణించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు కంపెనీ రూ.283 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.759 కోట్లుగా ఉన్నది.సంపాదన 4.29 శాతం పెరిగింది. కంపెనీ ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన రూ.25,747 కోట్ల నుంచి రూ.26,853 కోట్లకు పెరిగింది. జూన్ త్రైమాసికంలో కంపెనీ ఎర్నింగ్ పర్ కస్టమర్ (ఏఆర్పీయూ) రూ.146 గా ఉన్నది. గత త్రైమాసికంలో ఇది రూ.145 గా నమోదైంది.
ప్రతి వినియోగదారునికి 18.5 జీబీ నెలవారీ ఇంటర్నెట్ డాటా వినియోగిస్తున్నట్లు భారతీ ఎయిర్టెల్ కంపెనీ తెలిపింది. కొవిడ్ మహమ్మారి కారణంగా లాక్డౌన్ చెడు ప్రభావాన్ని చూపిందని, దీనివల్ల ఆదాయం తగ్గిపోయిందని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈఓ గోపాల్ విట్టల్ చెప్పారు. ప్రస్తుత త్రైమాసికంలో 51 లక్షల 4జీ కస్టమర్లు చేరారు. మే నెలలో 46.13 లక్షల మంది సబ్స్క్రైబర్లు దూరమయ్యారు. ఏప్రిల్లో కంపెనీ 5.17 లక్షల మంది కొత్త సబ్స్క్రైబర్లను చేర్చగా, రిలయన్స్ జియో రెండు నెలల్లో మెరుగైన పనితీరును కనబరిచింది. కాగా,హోమ్ బిజినెస్ సెగ్మెంట్ గత ఏడాది కంటే 12.9 శాతం ఆదాయంలో వృద్ధిని సాధించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు 2.85 లక్షల మంది చందాదారులు చేర్చారు. ఇది ఈ త్రైమాసికంలో అత్యధికం.
అన్ని సమయాల్లో మీతోనే.. శిల్పాకు చెల్లె షమిత బాసట
ఇక కల్తీ మద్యం అమ్మితే ఉరిశిక్షే..ఎక్కడంటే..?
రానున్న ఐదేండ్లలో లక్ష దాటనున్న బంగారం ధర
దేశం విడిచి వెళ్లండి: రష్యా దౌత్యవేత్తలకు అమెరికా ఆదేశం
పీవీ సింధు ఈ కులమేనా..? ఇంటర్నెట్లో జోరుగా సెర్చింగ్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..