RBI | ప్రభుత్వరంగ బ్యాంకైన బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda)కు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారీ షాక్ ఇచ్చింది. బీవోబీ (BOB)కి మరోసారి భారీ మొత్తంలో జరిమానా విధించింది. చిరిగిన నోట్ల మార్పిడికి (soiled note remittances) సంబంధించిన లావాదేవీల్లో వ్యత్యాసం కన్పించడంతో ఈ బ్యాంక్కు ఆర్బీఐ రూ.5 కోట్ల పెనాల్టీ వేసింది. ఈ విషయాన్ని శుక్రవారం నాటి ఎక్చేంజ్ ఫైలింగ్లో బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్లడించింది.
అంతేకాకుండా చిరిగిన నోట్లలో నకిలీ నోట్లను గుర్తించిన రిజర్వ్ బ్యాంక్.. బీవోబీకి అదనంగా మరో రూ.2,750 వడ్డించింది. డిసెంబర్ 18, 20 తేదీల్లో వేర్వేరుగా ఈ జరిమానా విధించినట్లు బీవోబీ వెల్లడించింది. కాగా, గత నెలలో కూడా బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఆర్బీఐ పెద్ద మొత్తంలో ఫైన్ వేసిన విషయం తెలిసిందే. నిబంధనలు పాటించకుండా భారీ మొత్తంలో రుణాలు జారీ చేసినందుకు బీవోబీకి ఆర్బీఐ రూ.4.35 కోట్ల భారీ జరిమానా విధించింది.
Also Read..
Mamata Banerjee | లోక్సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధాని మోదీపై పోటీ చేయండి.. దీదీకి బీజేపీ సవాల్
Human Trafficking | భారతీయులతో వెళ్తున్న విమానం ఫ్రాన్స్లో నిలిపివేత.. స్పందించిన భారత్
P Chidambaram | 2024 లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా చిదంబరం