Anand Mahindra | మహీంద్రా గ్రూప్ సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా వేదికలపై చురుగ్గా ఉంటారు. నిత్యం సోషల్ మీడియా వేదికలపై తన అభిప్రాయాలను షేర్ చేస్తూ నెటిజన్లను, వివిధ వర్గాల ప్రజలను ఆకర్షిస్తుంటారు. తాజాగా వరల్డ్ ఈవీ డే సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ రూపొందించిన తొలి ఎలక్ట్రిక్ వెహికల్ ‘బిజ్లీ’ గాధ షేర్ చేశారు. ‘ఈ రోజు వరల్డ్ ఈవీ డే. ఈ సందర్భంగా నాకు గతం గుర్తుకు వచ్చింది. ఇది ప్రతిష్టాత్మకం. 1999లో మహీంద్రా గ్రూప్ స్టాల్ వర్ట్ ఉద్యోగి నాగార్కర్.. మా తొలి త్రీ వీలర్ ఈవీ క్రియేట్ చేశారు’ అని ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేశారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతున్నది.
`నాగార్కర్ తన రిటైర్మెంట్కు ముందు మనందరికి ఇచ్చిన గిఫ్ట్ ఇది. భూమాత కోసం ఏదైనా చేయాలని ఉందని ఆయన చెప్పిన మాటలు ఎప్పటికీ నేను మరిచిపోను. అప్పటి పరిస్థితుల్లో బిజ్లీకి గుడ్ బై చెప్పాల్సి రావడం విచారకరం. కానీ, ఆ స్వప్నం ఇప్పటికి మనకు స్ఫూర్తినిస్తుంది. మన కలలు సాకారం అయ్యే వరకూ మనం విశ్రమించొద్దు` అని ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేశారు.
ప్రస్తుతం టాటా మోటార్స్ తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీలో మహీంద్రా అండ్ మహీంద్రా దూసుకెళ్తోంది. మహీంద్రా ఎక్స్ యూవీ 400 ఈవీ కారు అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ గా నిలిచింది. త్వరలో థార్ ఎస్యూవీ ఈవీ ఆవిష్కరణకు సిద్ధం అవుతున్నది.
Today is #WorldEVDay And it has propelled me back into the past. 1999 to be precise, when a stalwart of @MahindraRise Mr. Nagarkar, created our first ever EV—the 3 wheeler BIJLEE. It was his gift to us before retirement. I’ll never forget his words then: He wanted to do something… pic.twitter.com/f9KIXr1lkp
— anand mahindra (@anandmahindra) September 9, 2023