అన్నపురెడ్డిపల్లి: మండల కేంద్రంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. శనివారం ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పురోహితులు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణం జరిపించారు. భుక్తులు ఆలయంలో పూజలు చేసి, స్వామి వారి కళ్యాణం తిలకించారు. ఆలయ ఈఓ వేణు గోపాల్ గుప్తా భక్తులకు ఇబ్బందులు కలగుకుండా ఏర్పాట్లు చేశారు.