తమిళిసై వీడియో కాన్ఫరెన్స్
దమ్మపేట రూరల్, ఏప్రిల్ 7 : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ దమ్మపేట మండలంలోని మారుమూల గిరిజన కుగ్రామం పూసుకుంట గిరిజనులతో వీడియో కాన్ఫరెన్స్ గురువారం దమ్మపేట మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు రాజ్భవన్ జాయింట్ సెక్రటరీ భవానీ శంకర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో గ్రామసర్పంచ్, ఆశావర్కర్, అంగన్వాడీ కార్యకర్త, అంగన్వాడీ ఆయా, గ్రామపెద్దలు, ఎంపీవో, ఎంపీడీవో, గ్రామకార్యదర్శి పాల్గొననున్నారు.