జూలూరుపాడు: తరగతి గదుల్లో ఉపాధ్యాయులెవరూ సెల్ఫోన్ వాడొద్దని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ అన్నారు. మండలంలోని వినోభానగర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, పడమటనర్సాపురం గ్రామంలోని జిల్లాపరిషత్ సెకండరీ పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలకు హాజరైన విద్యార్ధుల సంఖ్య ఉపాధ్యాయుల వివరాలను అడిగి తెలుసుకొని, పాఠశాలలోని రికార్డులు పరిశీలించారు.
తరగతి గదులకు వెళ్లి విద్యార్ధులను పలు ప్రశ్నలు అడిగారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్ధులకు అర్ధమయ్యే రీతిలో పాఠ్యాంశాలు బోధించాలన్నారు. తరగతి గదులతోపాటు పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని కోరారు. ఉపాధ్యాయులు విధిగా సమయ పాలన పాటించాలని ఆయన సూచించారు.