టేకులపల్లి : సీఎం కేసీఆర్ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందు తున్నాయని జడ్పీచైర్మన్ కోరం కనకయ్య అన్నారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమానికి జడ్పీచైర్మన్ కోరం కనకయ్య ముఖ్య అతిధిగా పాల్గొని మండలంలో 36 చెరువులకు చేపపిల్లలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికైన నాటి నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి దృష్టిలో ఉంచుకోని అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు.
కులవృత్తుల వారికి, చేనేతన్నలకు, మత్స్యకారులకు, ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీలకు, ఈబీసీలకు, పేదలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశంలోనే ఉత్తమ సీఎంగా పేరు తెచ్చుకున్నారని, తెలంగాణ అభివృద్ధి ఒక్క టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్య రాధ,మత్స్యశాఖ ఏడీఏ వరదారెడ్డి, ఎంపీడీవో బాలరాజు, సర్పంచులు బోడ సరిత, నిరోష, బేతంపూడి ఎంపీటీసీ బానోత్ పూర్ణ, పంచాయితీ కార్యదర్శులు రజనీకాంత్, బాలకృష్ణ, టీఆర్ఎస్ నాయకులు భూక్య సైదులునాయక్, బోడ మంగీలాల్, బానోత్ భద్రు, రావూరి సతీష్, బానోత్ వాలు, మోహన్, చీమల రామయ్య, స్వామి, సొసైటీల అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.