ములకలపల్లి: ములకలపల్లి మండల కేంద్రంలో ఈనెల 21న జరగనున్న ఏఐకేఎస్(అఖిల భారత కిసాన్ సంఘం) జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి బ్రహ్మం పిలుపునిచ్చారు. శనివారం స్థానికంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రైతులను ఏక తాటిపై తెచ్చేందుకు ఏర్పాటు చేసిన తొలి సంఘం ఏఐకేఎస్ అన్నారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ రైతు వ్యతిరేక చర్యలతో రైతులను మోసం చేస్తున్నారని, రానున్న రోజుల్లో రైతుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం నిర్వహించేందుకు 21న ములకలపల్లిలో జరగబోయే జిల్లామహాసభకు రైతుసంఘాలు, రైతులు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతు నాయకులు నరాటి ప్రసాద్, సడియం వెంకటేశ్వర్లు, దుబ్బా వీరాస్వామి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.