గద్వాల, మే 17 : కరోనా తో జిల్లా దవాఖానలో చేరి చికి త్స పొందుతున్న వారితోపాటు వారి కుటుంబసభ్యులకు నిత్యం అన్నదానం చే యనున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి చెప్పారు. సోమవారం జిల్లా కేంద్రంలోని దవాఖానలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్తో కలిసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కొవిడ్ సంక్షోభంలో కరోనా సోకి దవాఖానకు వైద్యం కోసం వచ్చే వారు అన్నం లేక అల్లాడొద్దనే ఉద్దేశంతో దాతల సహకారంతో రో గులకు, వారి సహాయకులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. కరోనా బాధితులతోపాటు వారి బంధులవులకు సుమారు 630 మందికి అన్నదానం చేశారు. ఆహా రం దొరకని వారికి టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సాయంతో ఆహారం అందిస్తామన్నారు. దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం దవాఖానలో ఉన్న కరోనా వార్డును ఎమ్మెల్యే పరిశీలించి బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి చందూనాయక్, ఆర్ఎంవో వృశాలి, జెడ్పీటీసీ రాజశేఖర్, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్లు నరహరి శ్రీనివాసులు, నాగిరెడ్డి, నాగరాజు, నాయకులు రాముశెట్టి తదితరులు పాల్గొన్నారు.