కాకినాడ : (Kanna Babu) అసలైన రైతులను గుర్తించి వారిని ఆదుకునేందుకే ఈ క్రాప్ విధానాన్ని తీసుకొచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. ఎక్కడో అమెరికాలో ఉండే వారికి కాకుండా.. ఇక్కడ పంటలు పండించే రైతులకే సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని ఆయన తెలిపారు. రైతులు కాని వారు కూడా భూములను చూపి రైతులుగా చలామణి కావాలని చూస్తున్నారని మండిపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.
నిజమైన రైతులకే ఫలితం అందాలన్న ఉద్దేశంతోనే వైసీపీ ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చిందని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. సకాలంలో రైతులు తిరిగి చెల్లిస్తే రూ.లక్ష లోపు రుణాలకు సున్నా వడ్డీ కింద రాయితీ ఇవ్వాలన్నది ఈ పథకం ఉద్దేశమని తెలిపారు. 2020 ఖరీఫ్ సీజన్లో పంట రుణం తీసుకుని సకాలంలో చెల్లించిన వారు 6.67 లక్షల మంది. వారికి రూ.112.71 కోట్ల లబ్ధి పొందారని పేర్కొన్నారు. అలాగే, 2021 ఏప్రిల్ 20న 5.56 లక్షల మందికి రూ.92.38 కోట్ల చెల్లింపు జరిపామన్నారు. ఉచిత బీమా, పెట్టుబడి, సున్నావడ్డీ, మార్కెటింగ్ సౌకర్యం అన్నదాతలకు అందాలనే ఉద్దేశంతోనే ఈ-క్రాప్ విధానాన్ని రైతులు వేసిన పంటలకు అనుసంధానం చేశామన్నారు. ఈ సంస్కరణల వల్లే నిజమైన రైతులకు సున్నా వడ్డీ పంట రుణాలు అందుతున్నాయని మంత్రి వివరించారు.
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? న్యుమోనియా కావచ్చు !
చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు వస్తుంది.. హార్ట్ స్ట్రోక్ రావడానికి ముందు ఏమవుతుంది?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..