(Cinema Theatres) చిత్తూరు: ఏపీలో సినిమా థియేటర్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వందల సంఖ్యలో సినిమా టాకీసులు మూతపడ్డాయి. తనిఖీల పరంపర చిత్తూరు జిల్లాలో కూడా కొనసాగుతున్నది. జిల్లా వ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్ల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు వేర్వేరు ప్రదేశాల్లో ఒకే రోజు 52 థియేటర్ల మూసివేతకు అధికారులు నోటీసులు జారీ చేశారు. నియమాలు, నిబంధనలను పాటించడం లేదని ఏపీ సర్కార్ కొరడా ఝులిపిస్తున్నది. ప్రస్తుతం బాలకృష్ణ నటించిన అఖండ, అల్లు అర్జున్ నటించిన పుష్ప వంటి భారీ బడ్జెట్ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. ఈ సమయంలో థియేటర్లను మూసివేయడం ప్రజల్లోనూ కలకలం రేపింది.
రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు జిల్లావ్యాప్తంగా సినిమా థియేటర్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు మదనపల్లెలో ఏడు, కుప్పం, పీలేరు, పుంగనూరు, పలమనేరులో నాలుగు, వీ కోటలో మూడు, బీ కొత్తకోట, కలికిరిలో రెండు చొప్పున థియేటర్లకు మూసివేత నోటీసులు జారీ చేశారు. సినిమా థియేటర్లకు మూసివేత నోటీసులు జారీ చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) పీ రాజాబాబు స్పష్టం చేశారు. చాలా థియేటర్లు గత నాలుగైదేండ్లుగా, అంతకంటే ఎక్కువ కాలంగా లైసెన్స్లను పునరుద్ధరించుకోలేదని తెలిపారు. అలాగే, థియేటర్లలోని క్యాంటీన్లలో స్నాక్స్, శీతల పానీయాల అమ్మకాల్లో అధిక రేట్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా అనేకం ఉన్నాయి. దాంతో నిబంధనలు పాటించాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా పట్టించుకోనందునే మూసివేతకు నోటీసులు ఇవ్వాల్సి వస్తున్నదని తెలుస్తున్నది.
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..