హైదరాబాద్ : (Payyavula) ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ (ఏపీఈఆర్సీ) చైర్మన్తో ఏపీ పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ మంగళవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో భేటీ అయ్యారు. సెకి నుంచి సోలార్ విద్యుత్ను కొనుగోలు చేయాలన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోలార్ విద్యుత్ ఒప్పందం గురించి తెలుసుకున్నట్లు చెప్పారు. వినియోగదారుడిపై భారం పడకుండా కమిషన్ పని చేయాలని కోరినట్లు తెలిపారు. తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతుంటే అధిక ధరకు కొనుగోలు చేయడం ఏమిటని అడిగినట్లు చెప్పారు. ఏపీఈఆర్సీ చైర్మన్ నాగార్జునరెడ్డిని కలిసి విద్యుత్ ఒప్పందాలపై ఉన్న అనుమానాలు వివరించినట్లు తెలిపారు.
రైతు కోసం విద్యుత్ కొనుగోలు చేయడాన్ని తాము తప్పుపట్టడం లేదని పయ్యావుల కేశవ్ అన్నారు. అయితే, మార్కెట్లో తక్కువ ధరకే సోలార్ విద్యుత్ దొరుకుతుండగా అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం ఎందుకని ప్రశ్నించినట్టు తెలిపారు. విద్యుత్ కొనుగోలు విషయాన్ని కమిషన్ దృష్టికి తెచ్చానన్నారు. వినియోగదారులపై భారం పడకుండా కమిషన్ పనిచేయాలని సూచించినట్లు పయ్యావుల తెలిపారు.
చరిత్రలో ఈ రోజు : భారతదేశంలో భాగమైన జునాగఢ్ రాష్ట్రం
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
శీతాకాలంలో డైట్లో ఆవపిండి చేర్చుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..